Pages

Subscribe

ప్రథమ స్కంధము 226 - 231

ఆ. 227
ధనము లపహరించి తనతోడఁ జెనకెడు, నాతతాయి జనుల నని వధించి
బంధుమరణ దుఃఖభరమున ధర్మజుఁ, డెట్లు రాజ్యలక్ష్మి నిచ్చగించె.

వ. 228
అనిన సూతుండిట్లనియె.

క. 229
కురుసంతతికిఁ బరీక్షి, న్నరవరు నంకురము సేసి నారాయణుఁ డీ
ధరణీ రాజ్యమునకు 'నీ శ్వరుఁగా ధర్మజుని నిలిపి సంతోషించె.

వ. 230
ఇట్లు జగంబు పరమేశ్వరాధీనంబుగాని స్వతంత్రంబుగా దనునది మొదలగు భీష్ముని వచనంబుల హరి నంభాషణంబుల ధర్మనందనుండు ప్రవర్ధమాన విజ్ఞానుండును, నివర్తత శంకాకళంకుండును నై నారాయణాశ్రయుండైన యింద్రుండును బోలెఁ జతుస్సాగర వేలాలంకృతం బగు వసుంధరామండలంబు సహోదర సహాయుండై యేలుచుండె.

సీ.
సంపూర్ణవృష్టిఁ బర్జన్యుండు గురియించు నిల యెల్లఁ గోర్కుల నీనుచుండు
గోవులు వర్షించు ఘోషభూములఁ బాలు ఫలవంతములు లతా పాదపములు
పండు సస్యములు దప్పక ఋతువులనెల్ల ధర్మమెల్లెడలను దనరి యుండు
దైవ భూతాత్మ తంత్రములగు రోగాది భయములు సెందవు ప్రజల కెందుఁ

ఆ. 231
గురుకులోత్తముండు కుంతీతనూజుండు, దాన మాన ఘనుఁడు ధర్మజుండు
సత్యవాక్యధనుఁడు సకల మహీరాజ్య, విభవ భాజియైన వేళయందు.

0 comments: